Sunday, September 8, 2024

జీ 20 … 16 దేశాధినేతలు.. ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -

హాజరుకానున్న 16 దేశాధినేతలు

చైనా, రష్యా, స్పెయిన్, మెక్సికో నేతల గైర్హజరు

g-20-16-heads-of-state-special-arrangements-in-delhi
g-20-16-heads-of-state-special-arrangements-in-delhi

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8, (వాయిస్ టుడే):  ఢిల్లీలో జరగనున్న G20 సదస్సుకి ప్రపంచ దేశాల అధినేతలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు మరి కొన్ని దేశాల లీడర్స్ ఢిల్లీకి తరలి వస్తున్నారు. సభ్య దేశాల అధినేతలందరికీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ కొందరు మాత్రం హాజరు కావడం లేదు. రకరకాల కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించాయి. వీరిలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉన్నారు. జో బైడెన్ ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరినట్టు అమెరికా వెల్లడించింది. G20 సదస్సుకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం పడిందనే అంశంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో పాటు వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలన అంశాలపైనా చర్చించనున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్ ఈ G20 సదస్సుకి హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఆయన…బ్రిటన్ ప్రధాని అయ్యాక ఇండియాకి రావడం ఇదే తొలిసారి.  జపాన్ ప్రధాని ఫుమియో కిషిద కూడా G20 సమావేశానికి వస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతున్న సైనిక చర్యను ఈ వేదికగా తీవ్రంగా ఖండించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతానికి ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. అయినా…G20 సదస్సుకి హాజరవుతానని ప్రకటించారు. ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. .ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఈ సదస్సుకి వస్తున్నారు. కేవలం G20 సమావేశాలే కాదు…ప్రత్యేకంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలూ జరపనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే భారత్‌లోని G20 సదస్సుకి హాజరు కానున్నారు.  జర్మన్ ఛాన్స్‌లర్ ఒలఫ్ షోల్జ్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కూడా G20 సమావేశాలకు హాజరు కానున్నారు. ఉత్తర కొరియా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ఈ సదస్సులో చర్చించనున్నారు యూన్ సుక్.  సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస, టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌ G20 కి రానున్నారు.

నాలుగు దేశాధినేతల గైర్హజరు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ G20 సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించింది చైనా. ఆయనకు బదులుగా ఆ దేశానికి ప్రతినిధిగా కీలక నేత లీ క్వియాంగ్ రానున్నారు. 2008లో తొలిసారి G20 సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు సదస్సు జరిగినా చైనా అధ్యక్షుడు హాజరయ్యారు. చైనా ప్రెసిడెంట్ రాకపోవడం ఇదే తొలిసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడారు ప్రధాని మోదీ. ఆ తరవాత చాలా పరిణామాలు జరిగాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు పాల్పడినందుకు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. విదేశాలకు వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆయన ఇండియాలోని G20 సదస్సుకి హాజరు కావడం లేదని ప్రకటించారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్‌షెజ్‌కి కరోనా సోకింది. అందుకే G20 సదస్సుకి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. మెక్సికో అధ్యక్షుడు యాండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఆబ్రడార్ కూడా హాజరు కావడం లేదు.

రాష్ట్రపతి ప్రత్యేక విందు

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేకి G20 విందుకి ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. G20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబర్ 9న రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. అయితే…రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఖర్గేకి ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయనకే ఇన్విటేషన్ రాకపోవడం అలజడి సృష్టించింది. అయితే…ఖర్గే ఒక్కరినే కాదని, మరే ఇతర పార్టీలకు చెందిన నేతల్నీ ఈ విందుకి ఆహ్వానించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. మాజీ ప్రధానమంత్రులైన డాక్టర్ మన్మోహన్ సింగ్‌, హెచ్‌డీ దేవెగౌడనూ ఆహ్వానించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ఆహ్వానం పంపారు. ఈ విందుకి హాజరవుతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ వెల్లడించారు.  పార్లమెంట్‌ హౌజ్‌లో సాయంత్రం 6 గంటలకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. పార్లమెంట్ హౌజ్‌కి గెస్ట్‌లందరినీ సేఫ్‌గా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చశారు ఢిల్లీ పోలీసులు. భారత్ మండపంలోని మల్టీ ఫంక్షన్‌ హాల్‌లో ఈ విందు జరగనుంది. ఇదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలూ జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అతిథులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. మొత్తం 40 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్