భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో గాంధీ జయంతి వేడుకలు.
Gandhi Jayanti celebrations in Sircilla under the auspices of the Bharatiya Janata Party.

సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వాయిస్ టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్టోబర్ 2
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారు మాట్లాడుతూ,మహాత్మా గాంధీ ఆలోచనలు, ఆయన చూపిన సత్యం–అహింసా మార్గం ఇవాళ కూడా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళులు అర్పించినట్టవుతుంది. గాంధీ సిద్ధాంతాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ గారు, పట్టణ ఉపాధ్యక్షులు మోర శ్రీహరి, నరసయ్య, దేవరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, పట్టణ అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, నాయకులు చొక్కి శ్రీనివాస్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, మోర్చాల ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



