Sunday, April 19, 2026

ఈ నెల 30న డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్” గ్లింప్స్ రిలీజ్

- Advertisement -

ఈ నెల 30న డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్” గ్లింప్స్ రిలీజ్

Glimpses of a different sci-fi action thriller movie “Killer” releasing on the 30th of this month

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ముస్తాభవుతోంది.  ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు – జ్యోతి పూర్వజ్,  పూర్వాజ్, విశాల్ రాజ్, చందూ, గౌతమ్, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్