Sunday, January 25, 2026

 వ్యక్తిగా వెళ్తున్నా… శక్తిగా వస్తా..

- Advertisement -

 వ్యక్తిగా వెళ్తున్నా… శక్తిగా వస్తా..
హైదరాబాద్, జనవరి 5

Going as a person… coming as a force..
రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని కవిత విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు.కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. “వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తా” అని కవిత ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. “అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది” అని ఆమె పేర్కొన్నారు.సభ నుంచి బయటకు వచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కోసం, వారి ఆశయాల కోసం తెలంగాణ జాగృతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు. అవినీతి, రైతుల మీద కేసులు, బీఆర్ఎస్ సొంత నాయకులపై కేసులు, ఇంకా మరెన్నో బీఆర్ఎస్‌లో జరిగిన అక్రమాల గురించి తాను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. కుట్రదారులు, తెలంగాణ ద్రోహులు గెలిచారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ కోసం కడుపు కట్టుకుని పని చేసిన ఏ నాయకుడు ఉండలేకపోయారని అన్నారు. తాను ఊరుకునే వ్యక్తిని కాదని, కొట్లాడే ఆడబిడ్డనని అన్నారు. నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని నేడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ఒక రాజకీయ వేదిక అవసరమని, తెలంగాణ జాగృతి ఆ ఖాళీని పూర్తి చేస్తుందని అన్నారుఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న తనను ఆదరించమని ఆమె కోరారు. ఎప్పుడైనా కొత్త రాజకీయ శక్తి వస్తున్నప్పుడు ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సహజమే అన్నారు. తాను బీఆర్ఎస్‌లో వాటాలు కుదరక బయటకు వచ్చానని కాంగ్రెస్ అంటోందని, తనతో కాంగ్రెస్ మాట్లాడుతోందని బీఆర్ఎస్ చెబుతోందని, కానీ ఆ వాదనల్లో వాస్తవం లేదని అన్నారు.తనకు దైవభీతి ఎక్కువ అని, లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తనది ఆస్తుల పంచాయితీ కాదని, రాజకీయ పంచాయితీ అని అన్నారు. తాను బీసీల గురించి, అవినీతి గురించి మాట్లాడానని గుర్తు చేశారు. మండలి ఛైర్మన్ తన రాజీనామాను ఆమోదిస్తే ప్రజల కోసం పూర్తిగా పోరాడతానని అన్నారు.బతుకమ్మ వేడుకలను అడ్డుకునే ప్రయత్నంతో నన్ను కట్టడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకోలేక ప్రసంగం కొనసాగించారు. నేను ఎక్కడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను బాధపెట్టకుండా నవ్వుతూ పనిశాను. నా వద్దకు కాంట్రాక్టర్లు , పెట్టుబడిదారులు లేదు. నిరుపేదలు,ఆశావర్కర్లు, బీడీ కార్మికులు ఇలా అనేక మంది నిరుపేదలు వారి  సమస్యల పరిష్కారం కోొసం మాత్రమే నా వద్దకు వచ్చారు. జీహెచ్ ఎంసీ కార్మికుల, సింగరేణి ఉద్యోగులు,  విద్యుత్ ఉద్యోగులు ఇలా ఎవరు వచ్చినా పనిచేసిపెట్టాను. పార్టీ ఛానెన్లు , పేపర్లు ఎవరూ నాకు ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన 10ఏళ్లలో కాంట్రాక్టు వ్యవస్దను రద్దు చేసుకోలేకపోయాము. నేను పార్టీని ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయారు. కొందరు నన్ను టార్గెట్ చేశారు. పార్టీలోని కొందరు కక్షగట్టి బయటకు పంపారు.రాష్ట్ర స్దాయి నిర్ణయాల్లో మొదటి నుండి ఎక్కడా నా పాత్ర లేకుండా చేశారు. ధర్నా చౌక్ ను రద్దు చేయడం కూడా దారుణం. రైతులను కూడా అప్పట్లో అక్రమ అరెస్ట్ లు చేశారు. ప్రభుత్వంలో అవినీతిని ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. అమరజ్యోతి నుండి మొదలు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం..అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం. కలెక్టరేేట్లు సైతం అవినీతితో మునిగిపోయాయి.ఉద్యమకారులను సైతం నిర్లక్ష్యం చేసారు. మనిషికి 10లక్షలు ఇద్దామని చెప్పినా పట్టించుకోలేదు. పెన్షన్ ఇద్దామని చెప్పినా వినలేదు. నీళ్లు,నిధులు,నియామకాలు .. ఇలా అన్ని విషయాల్లోనూ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఇసుక దందాలు జరిగాయి. దళిత బిడ్డలు బలైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణం. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడం దారుణం.కేసీఆర్ దగ్గర మాట్లడే దైర్యం నాకు మాత్రమే ఉంది. ఆయన క్రింద ఉన్న అనేక మంది వ్యక్తులు తప్పుదోవపట్టిస్తున్నారు.టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చే నిర్ణయాన్ని సైతం నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఆరోజు జరిగిన మీటింగ్ కు సైతం నేను వెళ్లలేదు. పేరు మార్పుకు ఒప్పుకోలేదు. తెలంగాణలో ఏం పీకామని ,జాతీయ స్దాయిలోకి వెళతాము. అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. లక్షా 89 కోట్లు ఖర్చెపెట్టినా సాగునీటి ప్రాజక్టులు సరిగా పూర్తి చేయలేకపోాయాము. ఈ నిర్ణయాల వల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. ఒకే కంపెనీకి లక్షల కోట్ల ప్రాజెక్టు అప్పగించడం దారుణం. బీజేపి సైతం తెలంగాణను పదేపదే మోసం చేస్తూ వస్తోంది.  ఐఐటీ వంటి సంస్దలు తెలంగాణకు ఇవ్వలేదు. ఇక్కడి యువకులకు తీవ్ర అన్యాయం చేశాను. నేను బీజేపీపై పోరాటం చేస్తూనే ఉన్నాను. కేసీఆర్ పై కోపంతో నన్ను జైల్లో పెట్టారు. నన్ను జైల్లో పెట్టినప్పుడు పార్టీ ఎక్కడా అండగా నిలబడలేదు. నేను వారి భావజాలంతో లేనప్పుడు నన్ను తీసేయాలి.కానీ పార్టీలో ఉంచుతూ నన్ను ఒంటరిని చేశారు. కేసీఆర్ ను ఎవరు విమర్మించినా పట్టిచుకోరు, అదే హరీష్ రావు అంటే నిరసనలు చేస్తారు. ఇదే విషయాలు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. హరీష్ రావు అవినీతిపై బయటపెట్టానని నాపై పార్టీలో చర్యలు తీసుకున్నాను. బీఆర్ ఎస్ పార్టీ నిబంధనులు పెద్ద జోక్. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం దారుణం. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక పార్టీ నడిపే పద్దతి ఇది కాదు. బీఆర్ ఎస్ పార్టీ నుండి దూరమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం, నా రక్తం,నా శ్రమ.. నేను 20 ఏళ్లు పార్టీ గుంచి పడ్డ శ్రమ గుర్తించకుండా, కనీసం ఉరితీసేవాడ్నైనా అడుగుతారు. నన్నుమాత్రం అడగలేదు. కాంగ్రెస్ నా సస్పెన్షన్ వాడుకోవాలని చూస్తున్నారు. నాది ఆస్తి పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ.
నా  ఇద్దరు బిడ్డలమీద ప్రమాణం..
నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ, నా ఇద్దరు బిడ్డలమీద ప్రమాణం చేసి చెబుతున్నాను. రాజకీయ నాయకులకు,పార్టీలకు మహిళనేతలపై కనీస గౌరవం లేదు. ఆడవాళ్ల కష్టాలు ఎవరికి చెప్పాలి. మహిళల కొోసం పార్టీలు రాజ్యాంగాలు మార్చాలి. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఎవరు మహిళలను పట్టించుకుంటారు. కేసీఆర్ గారంటే మాకు అపార గౌరవం ఉంది. ఉద్యమకారులకు , కష్టకాలంలో అండగా ఉన్నవారిని అందరినీ ఇలా ఆగం చేస్తారని అనుకోొలేదు. ఉద్యమ ద్రోహులకు , రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ ఎస్ పార్టీ మారింది. నైతికత లేని పార్టీలో నేను ఉండలేను. ఆ పార్టీ పదవిలో కూడా ఉండలేను. నా రాజీనామా ఆమోదించాలని కోరుతున్నాను. కవిత భావోద్యేగ ప్రసంగం ఆద్యాంతం విన్న మండలి చైర్మెన్  మాట్లడుతూ .. మరోసారి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై ఆలోచన చేయాలని కోరారు. మీ ఆవేదన అర్దం చేసుకున్నాం. భావొద్వేగంతో నిర్ణయాలు సరికాదు. మరోసారి రాజీనామాపై ఆలోచన చేయాలని కోరుతున్నానని అన్నారు. వెంటనే స్పందించిన కవిత ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటికే సుధీర్గంగా ఆలోచన చేశాను. దయచేసి నా ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించాలని కోరుతున్నట్లు కవిత అన్నారు.
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి
కల్వకుంట్ల కవిత తన సొంత సంస్థ అయిన ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శాసనమండలికి రాజీనామా చేసిన అనంతరం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఆమె ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, ప్రజల గొంతుకగా నిలిచేందుకు ఒక కొత్త రాజకీయ శక్తి అవసరం ఉందని, ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తీసుకుంటుంది అని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కవిత, ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కక్షగట్టే ధోరణి పెరిగిపోయిందని, తనను ఘోరంగా అవమానించి బయటకు పంపారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, తన సొంత పుట్టిన ఇల్లే తనను చిన్నచూపు చూసిందని వాపోయారు. అందుకే ఆత్మగౌరవం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం బంధాలన్నీ తెంచుకుని బయటకు వచ్చినట్లు వివరించారు.   కొత్త పార్టీ విధివిధానాల గురించి మాట్లాడుతూ.. సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, నిరుద్యోగులు తనతో కలిసి నడవాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న  జాగృతి జనం బాట యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, త్వరలోనే పార్టీ పేరు, జెండా మరియు అజెండాను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ మహిళలను, నిరుద్యోగులను మోసం చేశాయని కవిత విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకే తాను ఈ అడుగు వేస్తున్నట్లు తెలిపారు.  ప్రజలు, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం. చట్టసభల్లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతాం అని  ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్