Sunday, September 8, 2024

పెండింగ్ప్రాజెక్టులపై  సర్కారు దృష్టి

- Advertisement -

పెండింగ్ప్రాజెక్టులపై  సర్కారు దృష్టి
మహబూబ్ నగర్,  జూలై 17

Government focus on pending projects

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఏడాదిలోనే ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్స్తోపాటు కొత్తగా చేపట్టనున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై అధికారులు దృష్టి సారించారు.  పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది., చాలా వరకు పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది డిసెంబర్వరకు టైం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నట్టు తెలిసింది. డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకొని అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు ఆర్డీఎస్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులపైనా అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిపై సోమవారం ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ పెండింగ్పనులున్నాయి? ప్రాజెక్టుల పనులకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటి? లాంటి వివరాలను మంత్రికి అధికారులు అందించనున్నట్టు తెలిసింది. తెలంగాణ చరిత్రలోనే అత్యంత లేట్ అయిన ప్రాజెక్ట్.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. 1984లో  ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. 2014లోగానీ పనులకు మోక్షం కలగలేదు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ లిఫ్ట్ స్కీమ్లో భాగంగా 4.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంకా 1.74 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ స్కీమ్లోని 29, 30వ ప్యాకేజీ పనులు పెండింగ్లో పడిపోయాయి. 29వ ప్యాకేజీలో భాగంగా 1.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని టార్గెట్పెట్టుకున్నారు. అయితే, పలు చోట్ల 1,670 ఎకరాల భూములను ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే, అందుకు చాలా చోట్ల రైతులు అడ్డుపడుతున్నారు.మరోవైపు సేకరించిన భూములకుగానూ రైతులకు  గత ప్రభుత్వం పరిహారం సక్రమంగా ఇవ్వలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ భూసేకరణ, పరిహారం విషయాలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటు 30వ ప్యాకేజీలో భాగంగా 14  వేల ఎకరాలు.. దానికి ఎక్స్టెన్షన్గా అచ్చంపేట బ్రాంచి కెనాల్ను 15 కిలోమీటర్ల మేర నిర్మించి, మరో 16 వేల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా డెడ్లైన్ విధించారు. ఇదే ప్యాకేజీలో వనపర్తి జిల్లాలోనూ 49 వేల ఎకరాల ఆయకట్టుకూ నీళ్లిచ్చేందుకు పనులు చేపట్టాల్సి ఉంది.ఈ వర్క్స్ను 2025 డిసెంబర్ లేదా 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తి చేసేలా టార్గెట్పెట్టుకున్నారు. అందులో భాగంగానే వాటి పనులను పూర్తి చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆ ప్రాజెక్టు టెండర్లపై కసరత్తులు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్కు 2015లో శంకుస్థాపన చేసినా.. ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాజెక్టులో రూ.15 లక్షల విలువైన పనులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం 34 భారీ మోటార్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నిరుడు సెప్టెంబర్లో గత ప్రభుత్వం తొలి మోటార్ను ప్రారంభించింది. నార్లాపూర్ పంప్హౌస్లోని తొమ్మిది పంపుల్లో ఒక మోటార్ను డ్రైరన్ చేశారు. పూర్తయిన ఫేజ్ కూడా జస్ట్ తాగు నీటి అవసరాల కోసం చేపట్టిన పనులే. అది తప్ప ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో గత సర్కార్ నిర్లక్ష్యం వహించింది.సాగునీటికి సంబంధించి ఏపీ కొర్రీలు పెడుతుండడంతో వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సర్కారు ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాజెక్టును తొలుత 6 రిజర్వాయర్లుగా నిర్మించాలనుకున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లలో నీటిని నింపుకొని, ఆయకట్టుకు నీళ్లివ్వాలని మొదట భావించారు. కానీ, ఆ తర్వాత గత సర్కారు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను వద్దనుకున్నది. ఉద్ధండాపూర్వరకు నిర్మించి నీటిని తరలించాలనుకుంది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను కట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని గత ప్రభుత్వం యోచించిందని, అందుకే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పక్కనపెట్టిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో అక్కడిదాకా కాదు కదా.. అసలు ఎంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చో కూడా సందిగ్ధత ఏర్పడిందని, ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్నూ నిర్మించేందుకు నిర్ణయించిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది డిసెంబర్నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్