రాజుల సిరిసిల్ల జిల్లా దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Government Whip Adi Srinivas participated in the Dussehra celebrations in Rajula Siricilla district


వాయిస్ టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా
: అక్టోబర్ 2. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ లోని శ్రీ శిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో జమ్మి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జమ్మి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వారాల దేవయ్య, ఉపాధ్యక్షులు కోనమ్మ నాగరాజు, కార్యదర్శి గంప రాజేందర్, కోశాధికారి కూర రమేష్, ఎం. బేరి నర్సయ్య, పీ. చర్. రవీందర్రావు, తొగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయి సంస్థాన్ దాతలు, భక్తులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై సాయిబాబా దర్శనం పొందారు. ఈ సందర్భంగా వారాల దేవయ్య మాట్లాడుతూ..“సాయిబాబా, అమ్మవారి కరుణతో అందరికీ శాంతి, సమృద్ధి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.



