- Advertisement -
భువనగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్
యాదాద్రి జిల్లా:ప్రతినిధి
యాదాద్రి జిల్లా:నవంబర్ 06
యాదాద్రి భువనగిరి జిల్లా లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభం స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనము అందజేశారు.
ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతంగా యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు.
- Advertisement -



