Friday, June 20, 2025

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు: మంత్రి పొన్నం

- Advertisement -

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు: మంత్రి పొన్నం
వరంగల్ జూన్ 3
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హనుమకొండలో జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం మాట్లాడారు. ఎన్నికల హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని, ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తామని, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోడీ కించపర్చారని, తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోదండరామ్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్