మున్నూరుకాపు వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్కు ఘన సన్మానం
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో
Harishankar honored by Munnur Kapu Journalist Forum![]()
![]()
తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా చల్ల హరిశంకర్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్ పటేల్ సూదుల వెంకటరమణ పటేల్ మాట్లాడుతూ
“సంఘానికి నిబద్ధతతో సేవలందించిన హరిశంకర్ నాయకత్వం మరింత బలోపేతం అవుతుంది. ఆయన ఆలోచనలు, కార్యకలాపాలు మున్నూరుకాపు సామాజిక, ఆర్థిక పురోగతికి దిక్సూచి కావాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు.
అవసరమైతే రాష్ట్ర స్థాయిలో చైతన్య యాత్రలు నిర్వహించి, మున్నూరు కాపు సమాజాన్ని ఒకతాటిపైకి తీసుకురావాలని ఫోరం ఆకాంక్ష వ్యక్తం చేశారు.
మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
చల్లా హరిశంకర్ పటేల్ మాట్లాడుతూ ఇది గౌరవమేగాక బాధ్యతను మరింత పెంచే సందర్భం. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు బంధువుల ఐక్యత, సంక్షేమం కోసం నా శక్తిమేర సేవ చేస్తాను. జర్నలిస్టుల నుంచి వస్తున్న అభినందనలు నాకు ప్రోత్సాహంగా నిలుస్తాయిఅని తెలిపారు.
ఈకార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు
బోనాల తిరుమల పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్ పటేల్, టి యు డబ్ల్యూ జె అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, బోనాల వెంకటేష్ పటేల్ , రఘు పటేల్,సుగుణాకర్ పటేల్, మడిపల్లి శ్రీనివాస్ పటేల్ ,మంద శ్రీనివాస్ పటేల్,హరికృష్ణ పటేల్, చల్ల కృష్ణ పటేల్, సుమ పటేల్,మధు పటేల్
పలువురు సీనియర్ జర్నలిస్టులు, సంఘ నాయకులు, పలువురు మున్నూరు కాపు మేధావులు పాల్గొన్నారు.



