Friday, June 20, 2025

చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్….

- Advertisement -

చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్….మోసం చేసాడు అంటూ పీస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ ..హీరోయిన్ లావణ్య

 

హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు.

ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్..

పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది.

సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది.

రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది.

తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది.

3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది.

లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు. అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.

అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్