- Advertisement -
బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ప్రజలు తమను విశ్వసించాలని టెలివిజన్ మాధ్యమం ద్వారా కోరారు. రిజర్వేషన్ల హింసాకాండలో బలైనవారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. హంతకులను తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పాలనపై ఇప్పటికే BNP, జాతీయ పార్టీ, జమాత్ ఈ ఇస్లామీ పార్టీలతో చర్చించామన్నారు.
- Advertisement -



