విద్యకు అధిక ప్రాధాన్యత
తాడేపల్లిగూడెం:
నవాబుపాలెంలో స్టూడెంట్స్ కిట్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు..
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఉంటుందని టిడిపి జిల్లా కార్యదర్శి మద్దుకూరి ధనరాజు, జనసేన మండలాధ్యక్షుడు అడపా ప్రసాదు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో స్టూడెంట్స్ కిట్ కంపెనీ కార్యక్రమం సర్పంచ్ మద్దుకూరి గంగాభవాని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామ నుంచి సహకారం ఉంటుందని తెలిపారు. పాఠశాల హెచ్ఎం పుష్పరాజు మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండి వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ బల్నీడి కృష్ణ, ఉప సర్పంచ్ వై కళ్యాణి, కూటమి నాయకులు బండి సూరిబాబు, మంచాల కృష్ణ,నాగు, బండి శ్రీను, గరగ దుర్గారావు, బండి శివ నాయుడు, బండి కాశీ విశ్వేశ్వరరావు, అడపా స్వామి తదితరులు పాల్గొన్నారు.