పిర్జాదిగూడ సాయి ఐశ్వర్య కాలనీలో హై టెన్షన్..

సాలార్జంగ్ కంచె సీలింగ్ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.
అడ్డుకున్న బిఆర్ఎస్ నేతల అరెస్ట్..
భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
కక్ష సాధింపు చర్యే అంటూ మేయర్ జక్కా హితావు…
వాయిస్ టుడే న్యూస్, జులై 8 మేడిపల్లి : మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలో సాలార్జంగ్ కంచాలో సీలింగ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన మేడిపల్లి తహసిల్దార్ హసీనా.. హుటాహుటిన బిఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని కూల్చివేతల ఆపాలని కక్షపూరిత చర్యలతో పేదలు బలి అవుతున్నారని విన్నవించినా కూడా కూల్చివేతలు జరిపారు. ఎందుకుగాను వ్యతిరేకంగా మేయర్ మరియు బాధితులు కలిసి అడ్డుకొని నిరసన చేపట్టే క్రమంలో తొక్కిసలాట జరగడంతో మేయర్ కింద పడడం తో స్వల్ప గాయాలు అయ్యాయి అనంతరం మేయర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చర్యల వల్లే ఈరోజు అమాయకుల ఇండ్లను కూల్చి వేస్తున్నారని వీటితో కాంగ్రెస్ పార్టీ యొక్క కక్షపూరిత చర్యలు బయటపడ్డాయని తెలిపారు.