Sunday, September 8, 2024

హైజాక్ బెదిరింపులు… అరెస్ట్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు9:  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే విమానాన్ని హైజాక్‌ చేయబోతున్నట్టు అర్థరాత్రి మెయిల్‌ పెట్టాడు  ఆగంతకుడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఈ మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.  ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. ప్రయాణికులను  హోటల్‌కు తరలించారు. తనిఖీల్లో హైజాక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని హైజాక్‌ చేస్తామంటూ అర్థరాత్రి వచ్చిన మెయిల్‌ ఫేక్‌ అని నిర్ధారించుకున్నారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు. అయితే… ఈ మెయిల్ ఎవరు చేశారనే దానిపై  విచారణ చేపడుతున్నారు. ఈమెయిల్‌ వచ్చిన ఐపీ అడ్రెస్‌ ఆధారంగా విచారణ చేపడుతున్నారు టెక్నికల్‌ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు  అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Hijack threats... Arrest
Hijack threats… Arrest

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్‌ రావడం ఇది మొదటిసారేం కాదు. పలుమార్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్‌ చేశారు. మెయిల్‌ వచ్చిన ప్రతిసారి  భద్రతా సిబ్బంది పరుగులు పెట్టడం… తనిఖీలు చేయడం… అది ఫేక్‌ అని తేల్చడం… ఆ తర్వాత ఊపిరిపీల్చుకోవడం. ఇదే జరుగుతోంది. ఆగస్టులో కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి… ఎయిర్‌పోర్టులో బాంబు ఉందని.. ఏ క్షణమైనా పేలొచ్చని చెప్పాడు. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది… తనిఖీలు చేపట్టి బాంబు లేదని నిర్ధారించారు. అది ఫేక్‌కాల్‌ అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా విమానమే హైజాక్‌ చేస్తామంటూ వచ్చిన మెయిల్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది మరోసారి ఉలిక్కిపడ్డారు. ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. హైఅలర్ట్‌ విధించారు. హైజాగ్‌ చేస్తామని బెదరించిన దుబాయ్‌ విమానాన్నే కాదు.. ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. ఎయిర్‌పోర్టులో తనిఖీలతో ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్‌పోర్టులో ఒక్క ఇంచి కూడా వదలకుండా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు పోలీసులు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయపడిపోయారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్