- Advertisement -
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
తిరుమల: పటాన్ చెరువు నియోజక వర్గంలో తాను మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం జరిగిందని, అదంతా శ్రీవారి ఆశీస్సులు వల్లనే జరిగిందని అన్నారు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన… వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగానే ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని, ప్రజా సమస్యల పైన పోరాడుతామన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.
- Advertisement -



