Sunday, September 8, 2024

అనుమానంతో భార్యపై బ్లేడు తో భర్త దాడి

- Advertisement -
Husband attacks wife with blade on suspicion
Husband attacks wife with blade on suspicion

విశాఖ జిల్లాలో దారుణం

భార్యపై అనుమానంతో బ్లేడు తో విచక్షణా రహితంగా భర్త దాడిచేసి గాయపరిచాడు.  విశాఖ జిల్లా ఆరిలోవ సిఐ సోమ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ప్రసాదు, వాసుపల్లి నీలిమ వీరు ఇరువురు భార్య భర్తలు. వీరి ఇరువురు మధ్య మనస్పర్థలు కారణంగా భార్య నీలిమ ఆరిలోవ టిఐసీ పాయింట్ వద్ద నివసిస్తోంది. భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ వీరు పూర్ణా మార్కెట్ లో నివసిస్తూవుంటారు.  ఈ క్రమంలో బుధవారం  భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ ఆరిలోవ వచ్చి తన భార్య నీలిమను మాట్లాడాలని బయటకు పిలిచి గొడవకు దిగాడు. భర్త వాసుపల్లి ప్రసాదు తన వెంట తీసుకొచ్చిన బ్లేడు తో భార్య నీలిమను విచక్షణా రహితంగా గాయపరిచాడు. మెడ పైన,మొహంపైనా బ్లేడుతో గాయపరిచినట్లు సిఐ తెలిపారు. భార్య నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ప్రసాదు, అత్త ముత్యాలమ్మ  ఇరువురుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు  తెలియజేసారు.  ఎస్సై సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్