Monday, March 24, 2025

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు

- Advertisement -

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు
హైదరాబాద్

Husbands complain at police station that wives are drinking

మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు సంసారం నాశనమై పోతుందని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నా రని,పురుష మా లోకం  లబోదిబోమంటున్నారు.
మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తున్నదంతా సారాకు తాగేస్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది.
బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్‌ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు. తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారుచేస్తూ విక్రయిస్తు న్నారని తెలిపారు. ఊళ్లో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాది స్తుంటే.. అడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారబోసేస్తున్నారని వాపోయారు.
దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒక్కటే తక్కువయ్యింది. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు. పోలీ సులు ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసు కెళ్లిన బాధితులు సారాను అడ్డుకోవాలని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్