Sunday, September 8, 2024

నేనే సీఎం….

- Advertisement -

కాంగ్రెస్ లో పెరుగుతున్న వాయిస్ లు

హైదరాబాద్, నవంబర్ 17, (వాయిస్ టుడే):  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత రాజకీయాలకు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని  పేరు పెట్టుకుంటారు. అంటే ఎవరికి వారు గ్రూపులను మెయిన్ టెయిన్ చేయడమే కాదు  చాన్స్  వస్తే తాము పీసీసీ చీఫ్  అని లేదా ముఖ్యమంత్రి అని ప్రకటనలు చేసేసుకుంటూ ఉంటారు. వీరి తీరు చూసి ఇతర పార్టీలు.. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు నెలలకో సీఎం వస్తారని అలాంటి పార్టీ మనకు అవసరమా అని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.  పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించాల్సిన నేతలు.. తామే ముఖ్యమంత్రి   అవుతామన్న ప్రకటనలు చేసుకుంటూ ప్రత్యర్థులకు చాన్సిస్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇదే పరిస్థితా అని ఓటర్లకూ అనుమానం కలిగేలా చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, సోనియాగాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని, పార్టీలో తనకంటే సీనియర్లు ఎవరూ లేరని భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ లో తన కంటే సీనియర్లు ఎవరూ లేరని ఆయన చెప్పుకున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లోనే కాదు.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాశం అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరికి వారు తానే సీఎం అని ప్రకటించుకుటూ ఉంటారు. రేవంత్‌రెడ్డి కాబోయే సీఎం అని  ఆయన చెప్పుకోరు కానీ ఆయన అనుచరులు ప్రకటిస్తూనే ఉంటారు.  ఇక  జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి తనను వెదుక్కుంటూ వస్తుందని చెప్పారు.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ లాంటి నేతలు ఇప్పటికే తాము సీఎం రేసులో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉన్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆరెస్‌ నాయకులు తరచూ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో డజన్‌మందికిపైగానే సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేస్తుంటారు.కొంత మంది సీనియర్ నేతలు ముందు కాంగ్రెస్ గెలిస్తేనే కదా ఏ పదవి అయినా వచ్చేది.. ముందు గెలుపు మీద దృష్టి పెట్టాలని సీఎం పదవిపై కామెంట్ చేస్తున్న వారికి హితవు చెబుతున్నారు.   ‘కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో గెలవండి. తర్వాత సీఎం పంచాయితీ’ అని కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో సీనియర్‌ నేత హన్మంత రావు  సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీ నేతలంతా అసలు పదవుల గురించి మర్చిపోయి  పార్టీ గెలుపు కోసం కష్టపడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.  ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా అంతిమంగా అంతా ఒక్కతాటిపైనే ఉన్నామనే సంకేతాలు వెళితేనే పార్టీ గెలుస్తుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం అంచనాగా ఉంది.

I am CM...
I am CM…

ఇలాంటి ప్రకటనలపై కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం చెప్పారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చని అదే బీఆర్‌ఎస్ పార్టీలో సీఎం అవుతానని హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. అలా చెబితే తెల్లవారే సరికి ఆయన జైల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం కావాలన్నది  సీఎల్పీ భేటీలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ విజయంలో కీలక పాత్ర పోషించినా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్దరామయ్యకు ఉండటంతో ఆయనకే సీఎం పీఠం అప్పగించారు. అయితే తాము శివకుమార్ కు ఇవ్వాలనుకుంటే ఇచ్చి తీరుతుంది.  అంతిమంగా తాము అనుకున్నదే ప్రతిపాదించి.. ఆమోద ముద్ర వేయించుకుంటుంది. పార్టీ ప్రయోజనాలను కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుంది. తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో సందేహం లేదు. హంగ్ వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఒక ఏ పార్టీకి అయినా పూర్తి మెజార్టీ వస్తే అది రెండు, మూడు సీట్ల వరకే ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ లో వస్తే జరిగే రాజకీయం వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో తన అనుచరులకే ఎక్కువ సీట్లు ఇప్పించుకున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి వంటి స్థానాల్లో తాము చెప్పిన వారికే ఇప్పించుకున్నారు. ఇక మనుగోడులో ఆయన సోదరుడే పోటీ చేస్తున్నారు. ఆయనతో కలిపి నలుగురు అవుతారు. ఇలా కోమటిరెడ్డి గ్రూప్ ఓ ఐదుగురు ఎమ్మెల్యేల్ని సిద్ధం చేసుకుంటే… అదే కాంగ్రెస్ కు రెండు, మూడు ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టం. కాంగ్రెస్ లో ఇలాంటి రాజకీాయలు ఎన్నో జరుగుతూ ఉంాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ముందు గెలవండి.. ఆ తర్వాత పదవుల కోసం పోరాడుకోండి అని.. సలహాలిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ నేతలు క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఆకాశంలో మేఘాలు చూసుకుని .. కింద ముంత ఒలకబోసుకున్నట్లుగా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎట దారి తీస్తుందో మరి !

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్