Wednesday, January 21, 2026

పుట్టిల్లు పొమ్మంది..!  ఆమెకు ఏం తక్కువ చేశాను?

- Advertisement -

పుట్టిల్లు పొమ్మంది..!
 ఆమెకు ఏం తక్కువ చేశాను?

I am grateful to my mother..!
  What did I do wrong to her?

హైదరాబాద్

ఎంపీగా గెలిపించాం ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం
మద్యం కేసులో అరెస్టయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను.
బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌.
సస్పెండ్‌ చేస్తే పార్టీ పెడుతుందా? అని ఆరా.
కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీశ్‌రెడ్డి!

పుట్టిల్లు పొమ్మంది..పాపం కవిత..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన కూతురు కవితను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌..ఆమె తీరు పట్ల పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్‌ చేసే ముందు ఫామ్ హౌస్ లో ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కవితకు ఏం తక్కువ చేశాను? నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశమిచ్చి గెలిపించుకున్నాం. రెండోసారీ చాన్స్‌ ఇచ్చాను. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాను. మద్యం కేసులో అరెస్టయితే ఎంతో ఖర్చుపెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లతో వాదించాం? అయినా కవిత ఎందుకిలా చేసింది? అని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. కాగా, పార్టీ నేతలు కవితపై తమ అభిప్రాయాలు చెప్పే సమయంలో కొన్ని అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. కవిత సీఎం రేవంత్‌ ఫోల్డర్‌లో పనిజేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు కూడా చూపించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే కవితను సస్పెండ్‌ చేస్తే ఆమె ఏం చేస్తుందోనన్న అంశంపై కూడా కేసీఆర్‌ చర్చించినట్లు, కొత్త పార్టీ పెడుతుందా? అని ఆరా తీసినట్లు తెలిసింది. అయితే సస్పెండ్‌ చేస్తే కాంగ్రెస్ లో చేరతారని, కవితకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు కేసీఆర్‌కు వివరించారు. దీంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకవేళ కవితకు మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభం. అని కేసీఆర్‌ అన్నట్లు సమాచారం. కాగా, కవితను సస్పెండ్‌ చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని, ఎంతటి వారినైనా సస్పెండ్‌ చేస్తారనే భయం కలుగుతుందని కొందరు నేతలు కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. కవితను సస్పెండ్‌ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారని చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కేసీఆర్‌ కూతురి విషయంలో ఏకపక్షంగా ఉంటున్నారని ప్రచారం పెరుగుతుందని, సస్పెండ్‌ చేస్తే వ్యతిరేకంగా పనిచేసే వారికి హెచ్చరికగా ఉండడంతో పాటు గతంలో చెప్పిన విధంగా పార్టీయే తన కుటుంబంగా కేసీఆర్‌ భావించారని ప్రజల్లో ప్రచారం జరుగుతుందని భావించినట్లు తెలిసింది. ఇటీవల కవిత ‘లిల్లీపుట్‌’ అంటూ వ్యాఖ్యానించిన నేత..ఆమెను బహిష్కరిస్తేనే పార్టీకి మంచిదని చెప్పినట్లు సమాచారం. నేతలందరి అభిప్రాయాలు విన్న కేసీఆర్‌ చివరికి కవితపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్