- Advertisement -
ధర్మం గెలిచింది… న్యాయం నిలబడింది
అదిలాబాద్: జైనథ్ బిజెపి మండల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ జైనాథ్ మండల కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు. అంతకుముందు అయన లక్ష్మీ నారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం నిరాల గ్రామంలో ఫంక్షన్ హల్ లో మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఎన్నికల లా కాకుండా ఒక యుద్ధంలా జరిగాయి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో ధర్మం గెలిచిందని అన్నారు.
ఈ గెలుపు మన అందరి సమిష్టి కృషి అన్నారు. ప్రజలు మనల్ని ఆదరించారు ఎలాంటి పక్షపాతం లేకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని అన్నారు.
- Advertisement -



