Sunday, May 18, 2025

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే అధికారం.. IPSS టీమ్‌ సమగ్ర సర్వే ఫలితాలు

- Advertisement -

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే అధికారం..
హైదరాబాద్, ఏప్రిల్ 23, (వాయిస్ టుడే)

If elections are held now, BRS will be in power.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు SAS గ్రూప్, IPSS టీమ్‌ హైదరాబాద్‌ నిర్వహించిన సమగ్ర సర్వే ఫలితాలు రాష్ట్రంలోని ప్రజా మనోభావాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2025 ఏప్రిల్‌ 20 నాటి ఈ సర్వే 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32,500 నమూనాలతో నిర్వహించబడింది. ఈ సర్వే ఫలితాలు రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై ప్రజల అసంతృప్తిని, రాజకీయ పార్టీల పనితీరుపై వారి అభిప్రాయాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.సర్వే నిర్వహణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణలో సమతూక రీతిలో విభిన్న వర్గాల నుంచి నమూనాలు సేకరించారు.
నమూనాల సంఖ్య: 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 32,500 నమూనాలు సేకరించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 280–290 నమూనాలు.
సమయం: 2024 ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 17 వరకు.
సాంప్లింగ్‌ పద్ధతి: 55% స్ట్రాటిఫైడ్‌ (ఎంపిక చేసిన) సాంప్లింగ్, 45% రాండమ్‌ సాంప్లింగ్‌. ప్రతి నియోజకవర్గంలో 130 రాండమ్, 160 స్ట్రాటిఫైడ్‌ నమూనాలు.
విభాగాలు: ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌–రంగారెడ్డి బెల్ట్‌లలో సమతూకంతో సర్వే నిర్వహించారు.
విభిన్నత: వయసు, లింగం, కులం, ఆదాయం, గ్రామీణ–పట్టణ విభజనలను పరిగణనలోకి తీసుకున్నారు.
పొరపాటు మార్జిన్‌: 1.5% నుంచి 2% మధ్య, ఫలితాల విశ్వసనీయతను నిర్ధారిస్తూ.
సర్వేలో పాల్గొన్న వర్గాలు
సర్వేలో రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆశా/అంగన్‌వాడీ కార్యకర్తలు, గృహిణులు, చిన్న వ్యాపారులు, బీసీ, ఎస్సీ/ఎస్టీ, ఓసీ, ముస్లిం సముదాయాలు, స్థానిక సంస్థ నాయకులు, కూలీలు, ధనిక/మధ్యతరగతి/పేద వర్గాలు పాల్గొన్నాయి. ఈ విభిన్న వర్గాల నుంచి సేకరించిన సమాచారం రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబిస్తుంది.
ప్రధాన అంశాలు (M–ఫ్యాక్టర్స్‌)
సర్వే ప్రకారం, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశాలు:
ద్రవ్యోల్బణం
రైతులు, కౌలు రైతుల సమస్యలు
చట్టం, శాంతిభద్రతలు
ప్రాథమిక సౌకర్యాలు (తాగునీరు, రోడ్లు, విద్యుత్, ఆరోగ్య కేంద్రాలు)
నిరుద్యోగం
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంతృప్తి/అసంతృప్తి
అభివృద్ధి కార్యక్రమాలు
ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు
పార్టీలలో సమూహ రాజకీయాలు
సర్వేలో కీలక అబ్జర్వేషన్స్‌
ప్రభుత్వంపై అసంతప్తి: కాంగ్రెస్‌ పార్టీ హామీలు (మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ గహాలు, యువ వికాసం, చేయూత) అమలు కాకపోవడం లేదా ఆలస్యం కావడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
మాజీ సీఎంపై విమర్శలు..
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్‌పై నిరంతరం విమర్శలు చేయడం ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తిస్తోంది. ప్రజలు మెరుగైన పాలన కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలపై ఉన్నట్లు భావిస్తున్నారు.పార్టీలో అంతర్గత సమస్యలు: కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించడం, సమూహ రాజకీయాలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు: ఈ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి ఉంది.
నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు: కొత్త ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
పోలికలు: ప్రజలు ప్రస్తుత పాలనను మాజీ బీఆర్‌ఎస్‌ పాలనతో పోల్చి, ప్రస్తుత పాలనా శైలిని ప్రశ్నిస్తున్నారు.భూసేకరణ వివాదాలు: లగడచర్ల భూ సేకరణ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కోసం భూ సేకరణలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది.హైడ్రాపై విమర్శలు: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ యాసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ పనితీరు పేద, మధ్యతరగతి వర్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని, ధనిక వర్గాలను విడిచిపెడుతోందని ప్రజలు భావిస్తున్నారు.పాజిటివ్‌ అంశాలు: పేదలకు నాణ్యమైన బియ్యం అందించడం, ఎస్సీ సముదాయ వర్గీకరణ కాంగ్రెస్‌కు కొంత ప్రయోజనం చేకూర్చాయి.
ప్రాంతీయ విభజన: ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పనితీరు సంతప్తికరంగా లేదు. బీజేపీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌లో కొంత వోటు షేర్‌ను పెంచుకుంది, కానీ రాష్ట్ర సగటు 18% వద్దే ఉంది.
వోటు షేర్‌ అంచనాలు (20.04.2025 నాటికి)
కాంగ్రెస్‌ (INC): 34.25% (–5.49% జటౌఝ 2023)
బీఆర్‌ఎస్‌ (BRS): 39% (+1.65% జటౌఝ 2023)
బీజేపీ (BJP): 18% (+3.85% జటౌఝ 2023)
ఎఐఎంఐఎం (AIMIM): 2.5% (+0.28% జటౌఝ 2023)
ఇతరులు: 6.25% (–0.29% జటౌఝ 2023)
అసెంబ్లీ సీట్ల అంచనా
మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో:
బీఆర్‌ఎస్‌: 58–60 సీట్లు
కాంగ్రెస్‌: 37–39 సీట్లు
బీజేపీ: 18–19 సీట్లు
ఎఐఎంఐఎం: 6–7 సీట్లు
తీవ్ర పోటీలో ఉన్న సీట్లు: 18 (బోథ్, సిర్పూర్, సంగారెడ్డి, జహీరాబాద్, జుక్కల్, ఎల్లారెడ్డి, హుజూరాబాద్, మానకొండూర్, మహబూబ్‌నగర్, అలంపూర్, షాద్‌నగర్, నర్సంపేట, మహబూబాబాద్, మిర్యాలగూడ, అలైర్, భద్రాచలం, నాంపల్లి, ఎల్‌.బీ.నగర్‌)
ప్రధాన సర్వే ప్రశ్నలు, ఫలితాలు
ప్రభుత్వ పనితీరు:
చాలా మంచిది: 3%
మంచిది: 22%
సగటు: 19%
చెడు: 47%
అభిప్రాయం లేదు: 9%
తదుపరి సీఎం ఎవరు?:
రేవంత్‌ రెడ్డి: 32%
కేసీఆర్‌: 43%
బండి సంజయ్‌: 14%
తెలంగాణ అభివృద్ధికి ఉత్తమ పార్టీ:
బీఆర్‌ఎస్‌: 41%
కాంగ్రెస్‌: 33%
బీజేపీ: 16%
చట్టం, శాంతిభద్రతలు:
మంచిది: 20%
సగటు: 21%
చెడు: 42%
కాంగ్రెస్‌ హామీల అమలు:
అమలయ్యాయి (సంతృప్తి): 20%
అమలు కాలేదు (అసంతృప్తి): 44%
పాక్షికంగా అమలు: 17%
హైడ్రా పనితీరు:
సంతృప్తి: 20%
అసంతృప్తి: 44%
పాక్షిక సంతృప్తి: 15%
2025 ఏప్రిల్‌ 20 నాటి సర్వే ప్రకారం, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉంది, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుపై అసంతప్తి స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ కొన్ని ప్రాంతాల్లో వోటు షేర్‌ను పెంచుకుంది, కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం పరిమితంగా ఉంది. ఈ సర్వే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సూచన మాత్రమే. రాజకీయ పరిస్థితులు, పార్టీల వ్యూహాలు, ప్రజల్లో నమ్మకం ఆధారంగా తుది ఫలితాలు మారవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్