Thursday, January 15, 2026

గోడ తీస్తే 3.. మూస్తే 8 కి.మీ.. అడ్డుగోడపై ‘హైడ్రా’ కొరడా, 25 వేల మందికి ఊరట

- Advertisement -

గోడ తీస్తే 3.. మూస్తే 8 కి.మీ.. అడ్డుగోడపై ‘హైడ్రా’ కొరడా, 25 వేల మందికి ఊరట
వరంగల్, జూలై 8, (వాయిస్ టుడే )

If the wall is removed, it will be 3 km. If it is closed, it will be 8 km. 'Hydra' whips on the barrier, relief for 25 thousand people

గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమణల తొలగింపునకు హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. మెరుగైన రవాణా సౌకర్యాల కోసం వందల నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లకు అడ్డుగా గోడలు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలపై హైడ్రా చర్యలు మొదలుపెట్టింది. తాజాగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్లంపేట-బాచుపల్లి మధ్య ప్రణీత్ ఆంటిల్యా కాలనీ కట్టిన అడ్డుగోడను హైడ్రా తొలగించింది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని.. దారిని అడ్డుకోవద్దని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజల ఏళ్లనాటి పోరాటానికి న్యాయం దక్కింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందల ఇండ్లు, నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేట్ వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లకు అడ్డంగా గోడలు నిర్మించడం వల్ల ప్రజలు దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కాలనీల్లో అడ్డగోడలను కూల్చివేసి, దారులు లేని ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తోంది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట- బాచుపల్లి మధ్య నెలకొన్ని ఓ దారి వివాదానికి పరిష్కారం చూపింది. ఔటర్ రింగ్ రోడ్డు  ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు చేరుకోవడానికి ఉన్న సులభమైన మార్గానికి ప్రణీత్ ఆంటిల్యా అనే కాలనీ నివాసులు అడ్డుగా గోడ కట్టడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.వాస్తవానికి ORR ఎగ్జిట్ నుంచి ప్రగతినగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ప్రణీత్ ఆంటిల్యా కట్టిన అడ్డుగోడ కారణంగా సుమారు 25,000 మందికి పైగా ప్రజలు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. మల్లంపేట గ్రామ ప్రజలతో పాటు, ప్రణీత్ లీఫ్ కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, లక్ష్మి శ్రీనివాస్ కాలనీ, హెచ్ ఎండీఏ తో పాటు మరిన్ని కాలనీల వాసులు ఈ అడ్డుగోడ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గోడ తొలగిస్తే 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో కూడిన దారి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. గతంలో ఈ ప్రాంతం గుండా బండ్ల బాట ఉండేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.ప్రణీత్ ఆంటిల్యా నివాసులు మాత్రం తమ కాలనీ గుండా రాకపోకలు పెరిగితే ఇబ్బందులు పడతామని, తమకు గోస మొదలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన హైడ్రా… లోతైన పరిశీలన చేసింది. హెచ్ ఎండీఏ అనుమతులు పరిశీలించగా.. ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని స్పష్టమైంది. అనుమతుల్లో 7వ అంశం ప్రకారం.. నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ నిర్మించరాదని, ముఖ్యంగా రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని, పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని స్పష్టంగా ఉంది.ఈ నిబంధనల ఆధారంగా హైడ్రా ఇటీవల అక్కడి ప్రహరీలను తొలగించింది. అయితే ప్రణీత్ ఆంటిల్యా కాలనీ వాసుల అభ్యంతరాలతో మరింత లోతుగా అధ్యయనం చేసింది. రెవెన్యూ అధికారులు కూడా ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచే గతంలో బండ్ల దారి ఉండేదని ధృవీకరించారు. నిజాంపేట మున్సిపల్ అధికారులు కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు. దీంతో హైడ్రా, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని, దారి ఇవ్వాల్సిందేనని స్పష్టంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మల్లంపేట ప్రజల ఏళ్ల నాటి పోరాటానికి న్యాయం దొరికింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్