Sunday, September 8, 2024

కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలో స్కాముల కాంగ్రెస్ మతతవ్వ బీజేపీ పార్టీ లకు చోటు లేదు

- Advertisement -

ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 27) : సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో కుత్బుల్లాపూర్ లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సూరారం డివిజన్ నెహ్రు నగర్ కు చెందిన పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నూతన పరిశ్రమలు, ఐటీ హబ్ ల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న అది ఒక్క కేసీఆర్ కే సాధ్యం అని ప్రజలు విశ్వాసంతో స్కాములు చేసే కాంగ్రెస్ పార్టీ, మతతత్వ విద్వేష రాజకీయాలు చేసే బిజెపి పార్టీలకు నియోజకవర్గంలో చోటు లేదని ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారని తెలిపారు, ఈ కార్యక్రమంలో సిరాజ్, జాఫర్, ఇమ్రాన్, రేహాన్, ఇమ్రాన్, సద్దాం, అస్లాం, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్