సెక్రటేరియట్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం
Indiramma House Survey Mobile App Inauguration Program in Secretariat
ముఖ్య అతిథిగా హజరయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్
రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు సెక్రటేరియట్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరయ్యారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, వేం
నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. టిఆర్ఎస్ పాలకుల తప్పిదాలకు వసతి గృహాల పిల్లలు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రజల
అవసరాల మేరకు తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాల నేపథ్యం లో సంబురాలు జరుపుతున్నాం. 4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు అందింస్తున్నామని అన్నారు..



