- Advertisement -
కడిగిన ముత్యంలా బయటకు వస్తా
న్యూఢిల్లీ
జై తెలంగాణ జై కేసిఆర్.. కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నాడు రౌస్ అవెన్యూ కోర్టు లో ఆమెను ఈడీ ప్రవేశపెట్టింది. కోర్టు లోపలికి వెళ్లేముందు ఆమె కెమెరాలముందు మాట్లాడారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. ఇదితప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీ లో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమి లో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారని ఆమె అన్నారు. నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా మారేది లేదని అన్నారు.
- Advertisement -