Sunday, September 8, 2024

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంచుకొవాలి

- Advertisement -

ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి
-మంథని మున్సిపల్ చైర్ పర్సన్  పెండ్రి రమా సురేష్ రెడ్డి
మంథని ప్రతినిధి,,జులై 05:
ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని  మున్సిపల్ చైర్ పర్సన్  పెండ్రి రమా సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న  ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు శుక్రవారం ఫ్రైడే  డ్రైడే  కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి  అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు గర్ల్స్ హై స్కూల్ ఏరియా, మందాట, 10వ వార్డు పద్మశాలి వీధి, 12 వ వార్డు సివిల్ హాస్పటల్ ఏరియా, 13వ వార్డు నదివీధి, పెంజరు కట్ట వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి  మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య తో కలిసి ఫ్రై డే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి నీరు నిల్వ ఉన్న కూలర్స్, కూండీలు, మొదలగు వాటిలో నీరును తొలగించారు. అవసరమగు ప్రదేశాలలో అయిల్ బాల్స్ మరియు బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ సిబ్బందిచే చల్లించారు. ఈ నిల్వ నీరు వల్ల  కలిగే ప్రమాదాలు చెప్పి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పించడమే మా ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మంథని మున్సిపాలిటీలోని 13 వార్డులలో కౌన్సిలర్లు, మెప్మా అర్పిస్, ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్స్ లతో ఫ్రై డే కార్యక్రమాన్ని వార్డు ఆఫీసర్స్ నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్