ముక్కంటి సేవలో ఇటలీ దేశస్తులు

- Advertisement -

శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం పరదేశీయులు సందడి చేశారు సంప్రదాయ దుస్తులతో ఇటలీ  దేశానికి చెందిన  32 మంది బృందంగా  విచ్చేశారు ముందుగా ఆలయంలో జరిగే రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు.  అనంతరం స్వామి అమ్మవార్లను  దర్శించుకున్నారు.  అదేవిధంగా ఆలయంలోపల వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి,  శని భగవానుని,  ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు ఇక్కడి ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్పకళల లను  చూసి ఆత్మానందాన్ని  పొందారు వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు వివరించారు ఆలయ అధికారులు ప్రత్యేక వసతులు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular