Sunday, September 8, 2024

జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

- Advertisement -

జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

సీపీఎం నేత బీవీ రాఘవులు

విజయవాడ, సెప్టెంబర్ 27:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది.. స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్ణయించింది.. చాలా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించినా జగన్ మాత్రం దాన్ని అమలు చేస్తున్నారు.. రాజకీయ నేతలను భయపెట్టి జైలులో పెట్టి పాలన చేస్తున్నారు.. వామ పక్ష పార్టీలు ప్రజా ఉద్యమాలను కూడా జగన్ అణిచివేస్తున్నాడు అంటూ బీవీ రాఘవులు అన్నాడు.రాష్ట్రంలో శాసనసభ ఉందా లేదా అని అనుమానం కలుగుతుంది అని సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రశ్నించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టులో బీజేపీ కుట్ర.. జగన్ కక్షసాధింపు ఉన్నాయి.. ఎన్నికలలో ప్రయోజనాలు ఆశించే, చంద్రబాబును అరెస్ట్ చేశారు.. ప్రత్యర్థులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ప్రయోజనం కలుగుతుందని జగన్ భావిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. జగన్ కూడా జైలు జీవితం అనుభబించిన వారే.. ప్రతిపక్షాలను అణిచివేయడం వల్ల ఉపయోగం ఉండదు అంటూ బీవీ రాఘవులు తెలిపారు. ఇలాంటి ఆలోచనను జగన్ మార్చుకుంటే మంచిది అని ఆయన సూచించారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయించాలని తెలిపారు. జగన్ ను ప్రజలు గమనిస్తున్నారు అంటూ బీవీ రాఘవులు అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్