Sunday, September 8, 2024

ఉమ్మడి అదిలాబాద్ అభివృద్ది బాధ్యత మాది: రేవంత్ రెడ్డి

- Advertisement -

ఖానాపూర్: కాంగ్రెస్ లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బీఆరెస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కనిపించడంలేదా అని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాడు అయన ఖానాపూర్ లో మీడియాతో మాట్లాడారు. కోట్లు ఉన్నోళ్లకు బీజేపీ, బీఆరెస్ టికెట్లు ఇచ్చింది. ఓటర్ల మద్దతు ఉన్న వెడమ బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. వాళ్లు దొరలవైపు ఉంటే… బొజ్జు ప్రజల వైపు నిలబడ్డాడు. మహారాష్ట్రను అడ్డుపెట్టుకుని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకుంది. కేసీఆర్ ధన దాహానికి ప్రాణహిత చేవెళ్ల బలైపోయింది. కడెం ప్రాజెక్టును కాంగ్రెస్ కడితే..  ఈ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ చూసుకోలేకపోతుంది. దళిత, గిరిజనులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఇంకెవరికి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పోడు పట్టాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ధరణి తెచ్చి మీ భూములను గుంజుకుంది. గిరిజనేతరులను ఈ ప్రభుత్వం నిండా ముంచింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఇంద్రవెళ్లి అమరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత మాది. సీఎం కేసీఆర్ అబద్దాలతో ప్రజలను నమ్మించాలని  చూస్తున్నారు. ధరణి రాకముందు రెండేళ్లు రైతు బంధు ఎలా ఇచ్చారు? వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదా? ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టారు. అందుకే ధరణి స్థానంలో కొత్త మెరుగైన సాంకేతికత తీసుకోస్తాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పిస్తామని అన్నారు.

joint-adilabad-development-responsibility-is-ours-revanth-reddy
joint-adilabad-development-responsibility-is-ours-revanth-reddy

గిరిజనేతరుల భూములకు రక్షణ కల్పిస్తాం. వారికి రుణాలు ఇచ్చి ఆదుకుంటాం. లంబాడీలు, ఆదివాసీలు నాకు రెండు కళ్లలాంటి వారు. ఆదివాసీలు, లాంబాడాల మధ్య పంచాయితీ తెంచుతాం. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే మేం నామినేషన్లు వేయం. లేకపోతే ఇంద్రవెల్లి అమరుల స్థూపం సాక్షిగా ముక్కు నేలకు రాస్తారా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు.. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు. కేసీఆర్ ఖేల్ ఖతం.. దుఖాణ్ బంద్. కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ను చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ… ముందు గుజరాత్ లో బీసీని సీఎం చేయాలి. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముగ్గురు బీసీలను సీఎం చేసింది. తెలంగాణలో బీజేపీ కి 100 స్థానాల్లో డిపాజిట్లు రావు. దొరల తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్