Sunday, February 22, 2026

పోలవరం నిర్వాసిత బీసీ–మున్నూరు కాపులకు న్యాయం చేయాలి: డా. కొండ దేవయ్య పటేల్

- Advertisement -

పోలవరం నిర్వాసిత బీసీ–మున్నూరు కాపులకు న్యాయం చేయాలి: డా. కొండ దేవయ్య పటేల్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను త్వరలో కలిసి వినతిపత్రం

Justice should be done to the displaced BC-Munnur Kapus of Polavaram: Dr. Konda Devaiah Patel

Justice should be done to the displaced BC-Munnur Kapus of Polavaram: Dr. Konda Devaiah Patel
Justice should be done to the displaced BC-Munnur Kapus of Polavaram: Dr. Konda Devaiah Patel

హైదరాబాద్:వాయిస్ టుడే పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ఏడు మండలాల్లో నిరాశ్రయులైపోయిన మున్నూరు కాపులు మరియు బీసీ కులాల సమస్యలు అత్యంత తీవ్రమని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు, BC JAC స్టేట్ కన్వీనర్ డా. కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు.

వీ ఆర్ పురం, కూనవరం, చింతూరు, ఎటపాక, వేలేరుపాడు, కుకునూరు, బుర్లపాడు— ఈ ఏడు మండలాల్లో దాదాపు 25 వేల మున్నూరు కాపులు, అదే విధంగా పెద్ద సంఖ్యలో బీసీలు నివసిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ‘త్రిశంకు స్వర్గం’లో జీవనం డా. దేవయ్య పటేల్ మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంత ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయారు. హక్కులు లేవు, పునరావాసం అసంపూర్ణం, ప్రాథమిక గుర్తింపులకే ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అందించడం లేదని ప్రజలు తమకెందిన బాధను చెప్పుకున్నారని వెల్లడించారు.

ఆదివాసులకు పూర్తి ప్యాకేజీలు – బీసీ, మున్నూరు కాపులకు అన్యాయం గిరిజనులకు పోలవరం ప్రాజెక్ట్‌లో ఒక్కో ఎకరాకు ₹5 లక్షల నష్టపరిహారం, ఇళ్లు, అనుబంధ సదుపాయాలు అందుతుండగా, మున్నూరు కాపులు మరియు బీసీలకు సరితూగని పలు రకాల అన్యాయం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. “ప్రతి కుటుంబానికి సమాన నష్టపరిహారం ఇవ్వాలి” – దేవయ్య పటేల్ “బీసీలు, మున్నూరు కాపులు కూడా అదే ప్రాంత ప్రజలే. అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి. నష్టపరిహారం, పునరావాస ఇళ్లు, ఉద్యోగావకాశాలు అందించాలి” అని ప్రభుత్వాలను కోరారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను త్వరలో కలవనున్న దేవయ్య పటేల్ ఇదే అంశంపై త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ప్రత్యక్షంగా కలిసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు.

హైదరాబాద్‌లో జనసేన పార్టీ జెనరల్ సెక్రటరీ రాము తాళ్ళూరి ను కలిసి పోలవరం నిర్వాసితల వివరాలను అందజేశామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్