- Advertisement -
మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన జువ్వాడి కృష్ణారావు
Juvwadi Krishna Rao expressed deep condolences on the death of Manmohan Singh
కోరుట్ల,
ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కళ సహాకారం అయిందని, ఇంతటి మేధావి మృతి భారతదేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు..
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.శుక్రవారం పట్టణంలోని జువ్వాడి భవన్ లో జరిగిన సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జువ్వాడి
కృష్ణారావు మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేసిన సేవలు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక పటిష్ట భారత్ గా రూపాంతరం చెందడానికి కారకులయ్యారని ఆ తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్లపాటు దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఇంతటి మేధావి మృతి భారతదేశానికి తీరని లోటని జువ్వాడి కృష్ణారావు అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజాం, నాయకులు వసీమ్,నయీమ్, మ్యాకల నర్సయ్య, అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఎంబేరి నాగభూషణం, వసీద్, జిందమ్ లక్ష్మీనారాయణ,
ఏఆర్ అక్బర్, రహీం,మున్ను, షేక్ మొహ్మద్, తెడ్డు విజయ్, ఎడ్ల రమేష్, బోయిని నాగరాజ్,సోగ్రాబి, ఎలిశెట్టి భూమరెడ్డి, బన్న రాజేష్, జాగిలం భాస్కర్, దండవేని వెంకటేష్, కోట గంగాధర్ ,ముజబిత్, అయూబ్, యూట్యూబ్ రాజు,రియాజ్ నేమురి భూమయ్య ,చిట్యాల లక్ష్మీనారాయణ, రిజ్వాన్, సోహైల్,లింబాద్రి పాల్గొన్నారు.
- Advertisement -