డీఈఓ రిపోర్ట్ ఆధారంగా కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎఫ్ఐఆర్: సీఈఓ
హైదరాబాద్ నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య వస్తే.. అక్కడ కొత్తవి మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని అన్నారు. ఇక నుంచి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు జరిగాయని, అలా గొడవలు జరిగిన ప్రతి కంప్లైంట్స్పై డీఈఓను రిపోర్ట్ అడినట్లు తెలిపారు.అలాగే ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కంప్లైంట్స్ వచ్చాయని చెప్పారు. డీఈఓ రిపోర్ట్ ఆధారంగా కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేస్తామన్నారు. అయితే, కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయిందని వికాస్ రాజ్ తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్ నమోదయిందని, రూరల్లో కూడా పోలింగ్ శాతం బాగానే ఉందన్నారు.



