*పటేల్ యూత్ గర్జన,భారీ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పటేల్ అన్నారు.*
- *పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవ*
*కార్యక్రమానికి హాజరైన*
*మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పటేల్*
.జిల్లా కేంద్రంలోని మారుతీ ఇన్ బంకేట్ హాల్ లో సోమవారం మున్నూరుకాపు సంఘం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పటేల్ గారు హాజరయ్యారు.
అనంతరం …
*ఈ నెల 14వ తేదీన కరీంనగర్ లో నిర్వహించే పటేల్ యూత్ గర్జన పోస్టర్స్ మరియు స్టికర్స్ ను పలువురు సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
మున్నూరు కాపు సంఘ అభివృద్ధి కొరకు ప్రతీ ఒక్క కుటుంబ సభ్యులందరూ సమిష్టి గా కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.
*ఈ నెల 14 వ తేదీన కరీంనగర్ లో నిర్వహించే పటేల్ యూత్ గర్జన ను విజయవంతం చేయాలని కోరారు.*
*కరీంనగర్ లోని బొమ్మ వెంకన్న గారి విగ్రహం నుండి భారీ ర్యాలీతో పటేల్ యూత్ ఫోర్స్ కార్యక్రమాన్ని నిర్వహించ బడుతుందని తెలిపారు.*
రాష్ట్ర నలుమూలల నుండి మున్నూరు కాపు సమాజం ఒక చైతన్యాన్ని తీసుకువచ్చే యూత్ ఫోర్స్ యాత్రను ఉద్యమాల గడ్డ నుంచి మొదలుపెట్టడం సంతోషంగా ఉందని,
ఇది మన ఐక్యతను చాటాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మండలానికి గ్రామానికి చేరే విధంగా అందరం కృషి చేసి పటేల్ యూత్ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నా వంతుగా సంఘ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ సేవలు అందించుటకు ముందుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో…
అయ్యన్న గారి భూమయ్య, యం. సి . లింగన్న,పొట్ట శేఖర్,పాకాల రామచందర్,కౌన్సిలర్స్ లక్కా కుల నరహరి, గండ్రత్ రమణ,ఆదుముళ్ల పద్మాకర్,గుమ్ముల ఆశోక్ మున్నుకపు జర్నలిస్టు ఫోరమ్ జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్,
కడెం మండల్ కన్వీనర్…
స్వామి పటేల్,నవీన్ పటేల్ బైంసా కన్వీనర్,
బండి సందీప్ కుంటల,
దేవేందర్ పటేల్,నరేందర్ పటేల్,ప్రవీణ్ పటేల్,సాయి పటేల్,నవనిత్ పటేల్,లక్ష్మీ నర్సయ్య పటేల్.అభిషేక్ పటేల్,
ప్రవీణ్ కుమార్ ఆనుముల ఆయా మండల పట్టణ కుల సభ్యులు ,తదితరులు ఉన్నారు.