Wednesday, March 18, 2026

చంద్రబాబును చంపడం కోసం కేసీఆర్ క్షుద్రపూజలు

- Advertisement -

చంద్రబాబును చంపడం కోసం కేసీఆర్ క్షుద్రపూజలు
హైదరాబాద్, జూలై 2

KCR's occult rituals to kill Chandrababu

బనకచర్ల వివాదంతో చంద్రబాబును భూతంగా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. బనకచర్ల అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి “మరణ శాసనం”గా మారాయని ఆరోపించారు. ముఖ్యంగా, కేసీఆర్ మరియు హరీష్ రావు సంతకాలతో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ఒప్పందాలు రాష్ట్ర జల వనరులను దెబ్బతీశాయన్నారు. రాయలసీమకు నాలుగు వందల టీఎంసీల జలాలను తరలించడానికి 2016లో కేసీఆర్ , చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయని.. జగన వచ్చాక పెన్నాకు తరలించడంపై చర్చలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత పోలవరం-బనకచెర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నిలబడిందని, ఈ ప్రాజెక్ట్ గోదావరి నది నీటి వాటాపై తెలంగాణ హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ విజయంగా ఆయన వర్ణించారు. తెలంగాణ జల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గోదావరి నది నీటి వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత బనకచెర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరే కంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జూన్ 19న ఢిల్లీలో సమావేశమై, ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.గోదావరి నదీ జలాల ఒప్పందంలో వరద నీటి లేదా అదనపు నీటి గురించి ప్రస్తావన లేదని, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్‌ను ఆధారం చేసుకుని తెలంగాణ హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2016లో కేసీఆర్, హరీష్ రావు చేసుకున్న ఒప్పందాలతోనే బనకచర్ల ప్రాజెక్టుకు పునాది వేశారని ఇది గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రయత్నంగా ఉందని విమర్శించారు.కేసీఆర్‌ను “శకుని మామ”గా, హరీష్ రావును “శనీశ్వరుడు”గా అభివర్ణించారు, ఈ ఇద్దరి నిర్ణయాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల విషయంలో, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు 811 TMC అడుగుల నీటిలో తెలంగాణకు 66% ఉండగా, కేసీఆర్ కేవలం 299 TMC అడుగులకు సంతకం చేశారని, దీనివల్ల తెలంగాణకు 512 TMC నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ఆరోపించారు.ప్రాజెక్టును తిరస్కరించడం తెలంగాణ ప్రజల విజయమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీకి నీటి వివాదంతో ఊపిరి పోసుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అబద్దాలు చెప్పడం వల్లనే 2023లో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదని .. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసలు అభ్యర్థులే దొరకలేదన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్