Friday, February 27, 2026

కేరళ, కర్ణాటకలు అతలాకుతలం

- Advertisement -

కేరళ, కర్ణాటకలు అతలాకుతలం

Kerala and Karnataka are the same

చెన్నై, డిసెంబర్ 4, (వాయిస్ టుడే)
మూడు రోజులపాటు తమిళనాడు, పుదుచ్చేరిని వణికించిన ఫెంగల్‌ తుఫాన్‌.. ఇప్పుడు కేరళ, కర్ణాటకపై ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ తెలిపింది.ఫెంగల్‌ తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో తుఫాన్‌ ప్రబావంతో మూడు రోజులు అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో రెండు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. ప్రాణ నష్టం జరుగకపోయినా తీవ్ర ఆస్తినష్టం జరిగింది. తాజాగా పశ్చిమ–మధ్య వైపు కదిలిన ఫెంగల్‌ తుఫాన్‌.. ఇప్పుడు కేరళ, కర్ణాటకపై ప్రభావం చూపుతోంది. తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ బలహీనపడుతుందని ఐఎండీ తెలిపినా, వర్షాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కేరళకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కేరళలోని మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్‌లో గడిచిన 24 గంటల్లో 20 సెం.మీల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. మొదట కొట్టాయం, పతనంతిట్టలను ఆరెంజ్‌ అలర్ట్‌లో ఉంచింది, అయితే వాతావరణ పరిస్థితులు మరింత దిగజారడంతో ఇది ఎరుపు రంగుకు అప్‌గ్రేడ్‌ చేయబడింది.వాతావరణ హెచ్చరికల దృష్ట్యా, పతనంతిట్ట, కొట్టాయం మరియు వాయనాడ్‌లోని జిల్లా యంత్రాంగం డిసెంబర్‌ 2, సోమవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇందులో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలు కూడా ఉన్నాయి. కేరళ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నివాసితులు, ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ తీరాలు, డ్యామ్‌ల సమీపంలో నివసించే ప్రజలు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం, మేఘాల కారణంగా చీకటి నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.నవంబర్‌ 30న తమిళనాడు, పు#దుచ్చేరి తీరాలను తాకిన ఫెంగల్‌ తుఫాను డిసెంబర్‌ వరకు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. డిసెంబర్‌ 1 సాయంత్రం నాటికి వ్యవస్థ బలహీనపడి అల్పపీడనంగా మారిందని ఐఎండీ నివేదించింది. ఇది తమిళనాడులోని విల్లుపురంకు వాయువ్యంగా 40 కి.మీ మరియు పుదుచ్చేరికి పశ్చిమ–వాయువ్యంగా 70 కి.మీ దూరంలో ఉంది. అల్పపీడనం గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతోంది మరియు డిసెంబర్‌ 2 రాత్రికి ఉత్తర అంతర్గత తమిళనాడులో అల్పపీడన ప్రాంతంగా మరింత బలహీనపడుతుందని భావిస్తున్నారు. ఉత్తర కేరళ–కర్ణాటక తీరాలకు ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వ్యవస్థ కారైకాల్‌ వద్ద డాప్లర్‌ వెదర్‌ రాడార్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉంటుంది.రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తుఫాను దక్షిణ భారతదేశం అంతటా కదులుతున్నందున, బెంగళూరుతో సహా ప్రాంతంపై ప్రభావం చూపుతుందని ఐంఎడీ అంచనా వేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్