Sunday, September 8, 2024

భర్తను చంపి. భార్యకు వాట్సాప్ మెసేజ్ చేసిన ప్రియుడు…!

- Advertisement -
Kill the husband. The boyfriend sent a WhatsApp message to his wife…!

పెద్దపల్లి జిల్లా; నవంబర్. 1 (వాయిస్ టుడే) గోదావరిఖని. వివరాలు..
మృతుడు లావుడియ మధుకర్ సింగరేణి పోతన కాలనీ,
8.ఇంక్లైన్ లో ఉద్యోగం చేస్తూ గోదావరిఖని ఉంటున్నాడు. మృతుడి భార్య లావుడియా (నునసవత్ ) రమ కి ఒక.పెళ్లిలో ధరావత్ గోవర్ధన్ తో పరిచయం. ఏర్పడింది పరిచయం అక్రమ సంబంధం గా మారినది. గోవర్ధన్ తరచు మృతుడి ఇంటికి వస్తూ పోతూ మరియు మృతుడి భార్య తో ఫోన్లో మాట్లాడుకోవడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే రెండు మూడు రోజులు ఉండేవాడు, అది చూసి భర్త మృతుడికి అతడి భార్య పై అనుమానం రావడం తో భర్తను చంపాలని ప్రియుడి గోవర్ధన్ తో చెప్పగా కూడా సరే అని ఒప్పుకున్నాడు. నిందితుడు గోవర్ధన్ మృతుడు మధుకర్ ని ను బయటకు ఎటు అయిన తీసుకు వెళ్ళి మందు తాగిచ్చి చంపి ఎవ్వరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం లా చనిపోయినట్లు చిత్రీకరిస్తే నీకు కూడా ఉద్యోగం వస్తది అని పథకం వేసుకొన్నారు.
సాయంత్రమే గోవర్దన్ అతడి స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్ లతో కలసి మధుకర్ ను చంపాలనే ఉద్దేశ్యం తో ఒక ఇనుప రాడ్ నాగరాజు యొక్క హీరో గ్లామర్ బైక్ ఫూట్రెస్ట్ వద్ద కనబడ కుండ కట్టుకొని గోదావరిఖని కి వచ్చి, రాత్రి 07:00 గంటలకు గోవర్ధన్ నిండుతురాలు రమకి ఫోన్ చేసి మృతుడి తో మాట్లాడి బయటకి రమ్మని చెప్పగా మృతుడు మధుకర్ తన పల్సర్ బైక్ పై రావడం తో అందరూ గోదావరిఖని 5 ఇంక్లైన్ వద్ద కలసుకొని అక్కడ రాజా రాణి వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసి అందరూ కలసి మాల్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద యు టర్న్ తీసుకొని మంచిర్యాల వెళ్ళే రోడ్డు వైపుకి కొద్ది దూరం వచ్చి రోడ్డు పక్కన మోటార్ సైకిళ్ళు అపి చెట్లల్లో తాగుతుండగా గోవర్ధన్ ముందుగానే మోటార్ సైకిలు కి కట్టుకున్న ఇనుప రాడ్ ను తీసుకుని మృతుడికి కనబడ గోవర్ధన్ అతడి ఫ్రెండ్స్ నాగరాజు, లక్ష్మణులము కలిసి ఇనుపరాడళతో తలపై కొట్టి చంపిన, తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో పడేసి అతని పల్సర్ బైక్ డామేజ్ చేసి, స్టార్ట్ చేసి అతని మీదకు వదిలి పెడితే అది పక్కకు పడినది, ఈ విషయం గోవర్ధన్, మృతుడి భర్య రమకి వాట్స్ అప్ ద్వారా ఫోన్ చేసి చెప్పి అనంతరం నిందితులంతా మోటార్ సైకిల్ పై పారిపోయినారు.
నిందితురాలు రమ మృతుడి తల్లిదండ్రులకి బంధువులకి తన భర్త రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినాడు అని అనుకునేలా నమ్మబలికినది. సమావేశంలో ఈ ఏసిపి తుల శ్రీనివాస్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రామగుండం ఎస్సై వెంకట్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్