Tuesday, October 22, 2024

 కాంగ్రెస్ గూటికి కేకే

- Advertisement -

 కాంగ్రెస్ గూటికి కేకే
హైదరాబాద్  జూలై 3,
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన .. మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారు. అంతకు ముందే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే పార్టీ మారితే అనర్హతా వేటు పడుతుంది. అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నారు. 2020లో బీఆర్ఎస్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకుపైగా పదవి కాలం ఉంది. అయితే రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉపఎన్నిక ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ షరతు మీదనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. కేకే కుమార్తె , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కేకే కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. కేసీఆర్ స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత … తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు  మంచి పదవి ఇచ్చి..  కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన పార్టీ మారిపోయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. గత మార్చిలో ఈ ఆహ్వానం ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉండంతో చేరిక ఆగిపయోయింది. ఆయన కుమార్తె మాత్రం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఆయన  బీఆర్ెస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో అధికారికంగా చేరకపోవడంతో సమస్య అయింది. ఇప్పుడు ఎమ్మెల్యేల బలం కూడా ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఉపఎన్నికల్లో మరోసారి పదవి పొందవచ్చన్న నమ్మకంతో రాజీనామాకు సిద్ధమయ్యారు.                                  బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలు కూడా చేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లీడర్లు పోయినా అలాంటి వాళ్లను వంద మందిని తయారు చేసుకుంటామని.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు 160 అవుతాయని అందరికీ అవకాశం దక్కుతుందని బుజ్జగిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రంమ బలంగా ఆకర్షన్ ను ప్రయోగిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్