చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి విజయం ఖయం*
*బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్*
*జూన్ 4న దేశం గెలుస్తుంది*
లోక్ సభ ఎన్నికలో చేవెళ్ల పార్లిమెంట్ లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని కొండాపూర్ డివిజన్ బీజేవైఎం నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ అన్నారు.
మన మోదీ 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించారు. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అందుకే వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వచ్చి, అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మనదేశం మాత్రం కరోనాను తట్టుకుని, 11వ ఆర్థిక వ్యవస్థగా స్థానం నుండి 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి ప్రధాని మోదీ తీసుకున్న గొప్ప చర్యలే కారణం. ప్రజలకు ధైర్యం చెప్పి, కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ఇన్నికోట్ల మంది ప్రజలకు అందించారు. ప్రజలు ఆకలితో ఉండకూడదని ప్రతీ పేదవారికీ మనిషికి 5 కిలోల చొప్పున మంచి సన్న బియ్యాన్ని రేషన్ ద్వారా 4 సంవత్సరాలుగా అందిస్తున్నారు. మరో ఐదేళ్ల పాటు ఇలాగే ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా మెరిసిపోతోంది.
లోక్ సభ ఎన్నికలో చేవెళ్ల పార్లిమెంట్ లో ప్రతిబూత్ లో ఉన్నా నాయకులు,కార్యకర్తలు పార్టీ గుర్తు అయిన కమలం పువ్వుకి ఓటు వేసి కొండ విశ్వేశ్వర రెడ్డి ని గెలిపీదం.