కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి :పైడాకుల అశోక్
KTR should apologize to Telangana women: Paidakula Ashok
మహిళలపై కనీస గౌరవం లేని కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అధికారంపోయిన కేటీఆర్ కు అహం తగ్గలేదు నిన్న కేటీఆర్ మహిళల పట్ల చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే బిఆర్ఎస్ నాయకులకు నొప్పేంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యములో కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం ములుగు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో టిపిసిసి పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు నిన్న కేటీఆర్ మహిళల పట్ల చేసిన వాక్యాలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యములో కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం ఈ సందర్భంగా పైడాకుల అశోక్ గారు మాట్లాడుతూ కేటీఆర్ కు అధికారం పోయిన తన అహం తగ్గలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందిస్తే కళ్ళు ఓర్వని బిఆర్ఎస్ నాయకులు ఇష్టంమున్నట్లు మాట్లాడుతున్నారని నిన్న మహిళల పట్ల కేటీఆర్ చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 8 నెలల గా పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పని చేస్తుంది అని ఇప్పటికే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయములో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడు దఫాలుగా 2 లక్షల రుణమాఫీ చేసిందని మహిళకు ఉచిత బస్ ప్రయాణం తో పాటు 500 కే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళా సాధికారతే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుందని కొంత మంది బిఆర్ఎస్ కుక్కలు సోషల్ మీడియా ను అడ్డుపెట్టుకొని మా నాయకురాలు పైన ట్రోలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గు లేని వెదవలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెపుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


