- Advertisement -
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిని చేరుకున్న కేటీఆర్ వద్దిరాజు
Hyderabad :
KTR Vaddiraju reaches AIG Hospital in Gachibowli

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో కలిసి ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిని సందర్శించారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.గోపీనాథ్ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని తెలిసిన వెంటనే కేటీఆర్ గారితో కలిసి ఎంపీ రవిచంద్ర ఏఐజీ ఆస్పత్రి చేరుకున్నారు.గోపీనాథ్ భౌతికకాయాన్ని కేటీఆర్,మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులు సందర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -


