Sunday, September 8, 2024

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను ప్రతి ఘటిద్దాం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను ప్రతి ఘటిద్దాం

ఫిబ్రవరి16 న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

సిఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్

జగిత్యాల,

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిగతించాలని సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పిలుపు నిచ్చారు.
సోమవారం సీఐటీయూ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని గోడ పత్రికలు విడుదల చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ  మోడీ  ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటిద్దా మన్నారు.
కార్పొరేట్ విధానాలను ధిక్కరిస్తూ  తెలంగాణ రాష్ట్రంలో 2024 ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె గ్రామీణ బంధు అన్ని కార్మికుల రంగాలను కలుపుకొని జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలన్నీ ఏకం కావాలన్నారు.
మోడీ స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు డిపాజిట్ చేస్తానని మాటలను మర్చిపోయారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు వర్తింప జేయాలని, ప్రతి వ్యక్తికి రెండు వందల రోజులు పని కల్పించాలని, రోజువారి వేతనం 600 తగ్గకుండా నిర్ణయించి ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఉప్ఫహ్యాయులకు సిపిఎఫ్ రద్దుచేసి పాత పెన్షన్ ఓపీఎస్ పునరుద్ధరణ వ్యతిరేకిస్తున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషనర్ నియమించకుండా జాప్యం చేస్తున్నదని ఆరోపిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దుచేసి తిరిగి యధావిధిగా పాత కార్మిక చట్టాలను అమలు చేయలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి స్కీమ్స్ అన్నిటిని వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్.ఇందూరి సులోచన, నాయకులు చంద్రయ్య,బి.శేఖర్, సలీం, హరీష్, మహ్మద్, లక్ష్మణ్,కె.వికాస్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్