- Advertisement -
గల్ఫ్ నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి
Liberation of two women from the Gulfనరసాపురం
గల్ఫ్ దేశం కత్తార్ లో ఏజెంట్ల చేతిలో మోసపోయి చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు చెందిన ఇద్దరు మహిళలు ఉండవల్లి రామలక్ష్మి వాటాల అరుణ లను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో సురక్షితంగా స్వగ్రామం నరసాపురం తీసుకువచ్చామని కేంద్ర మంత్రి వ్యక్తిగత సహహకుడు పేరాల మోహన్ తెలిపారు. ఏజెంట్ ల మాయమాటలు నమ్మి వేలల్లో జీతాలు వస్తాయని నమ్మి కత్తర్ దేశం వెళితే అక్కడ తమను వేరే వాళ్లకు అమ్మివేశారని వారు తమకు సరిగ్గా తిండి పెట్టకుండా చిత్రహీంశలకు గురిచేసారని ఎజెంట్ల చేతిలో మోసపోయామని తమ కుటుంబ సభ్యులకు తెలుపగ వారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆమె వ్యక్తిగత సహాయకుడు పేరాల మోహన్ ద్వారా తెలియచేయగా ఆమె వెంటనే స్పందించి ఎకష్ట్రానల్ ఏఫైర్స్ అధికారులతో మాట్లాడి వారిని వెంటనే ఇండియకు రప్పించారాని తెలిపారు.
తమను సురక్షితంగా స్వగ్రామం చేర్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదములు తెలిపుతూ ఆమె చిత్రపటానికి బాధిత మహిళలు ఆమె కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు
- Advertisement -




