హెలిప్యాడ్ ను సైతం వదిలిపెట్టని మద్యం ప్రియులు…

- Advertisement -

హెలిప్యాడ్ ను సైతం వదిలిపెట్టని మద్యం ప్రియులు…

Liquor lovers who don't even leave the helipad...

జమ్మికుంట

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నాయిని చెరువు కట్ట పైన మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో  కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు హెలిప్యాడ్  దిగడానికి  నాయిని చెరువు కట్టపై స్థలాన్ని కేటాయించడం జరిగింది. అటువంటి నేలపైన  ప్రతిరోజు సాయంత్రం వేళ చాలా రోజుల నుండి మద్యం  సేవించడానికి అడ్డగా మారిన హెలిప్యాడ్, యువత రాత్రి అయితే చాలు నాయిని  చెరువు కట్ట పైన మద్యం సేవించి బర్త్డే పార్టీలు చేసుకుంటూ మద్యం బాటిల్లను హెలిప్యాడ్ స్థలంలోనే  పగలకొడుతూన్నారు
ఇదే చెరువుకట్టపై క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేయడం జరిగినది,  ప్రతి సంవత్సరం మహిళలు పిల్లలు ఈ స్థలంలో సద్దుల బతుకమ్మ ఆటలు ఆడడం జరుగుతుంది గణేషుని నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గణనాధులను నాయిని  చేరువు లోనే నిమజ్జనం చేయడానికి ఇదే చెరువు కట్ట మీది నుండి క్రేన్ ద్వారా నిమజ్జనం చేసుకోవడం జరుగుతుందని  జమ్మికుంట పట్టణంలోని ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకుంటారని నిమజ్జనంలో భాగంగా కాళ్లకు చెప్పులు లేకుండా ప్రజలు భక్తిశ్రద్ధలతో వస్తారు కాబట్టి మద్యం బాటిళ్లు పగలగొట్టడం వలన ప్రజలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు స్పందించి ఇట్టి పవిత్ర ప్రదేశంలో  మద్యం సేవించకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular