మోదీ కి రాఖీ కట్టిన చిన్నారులు

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సోదరీ సోదరుల మధ్య బంధాన్ని చెప్పే రక్షాబంధన్ మన సంస్కృతికి ప్రతిబింబం. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహాన్ని, సామరస్యాన్ని పెంచుతుందని భావిస్తున్నాను’ అని పోస్ట్ చేసారు.. తన కార్యాలయంలో ఢిల్లీ స్కూల్ బాలికలతో ప్రధాని మోదీ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.