- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా ప్రజలు ఆశీర్వదించాలని మహేశ్వరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ కోరారు. రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్ లను వారి నివాసంలో అందెల శ్రీరాములు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



