Sunday, September 8, 2024

బిఆర్ఎస్ సభను విజయవంతం చేయండి :ఎంపీ రవిచంద్ర

- Advertisement -

బిఆర్ఎస్ సభను విజయవంతం చేయండి :ఎంపీ రవిచంద్ర

భద్రాద్రి కొత్తగూడెం/వాయిస్ టుడే : కొత్తగూడెంలో నవంబర్ 5వ తేదీన జరిగే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ను విజయవంతం చేయాలని, వనమాను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ రవిచంద్ర కొత్తగూడెంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.సుమారు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే వనమాతో కలిసి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ సభను దిగ్విజయం చేయడం, వెంకటేశ్వరరావును గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపించడం, కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి సీఎంగా కూర్చోబెట్టేందుకు మనమందరం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేద్దామన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసే వారి వివరాలు తనతో పాటు పార్టీ పెద్దలందరికి ఎప్పటికప్పుడు తెలుస్తుందని, తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, ప్రాధాన్యత ఉంటుందన్నారు. మనమందరం మరింత కృషి సంకల్పంతో రాజకీయాలలో 50ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వనమాను భారీ ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిపిద్దామని అన్నారు.తాను మీ అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశానన్నారు. తనకు కేసీఆరే నాయకుడని,ఆయన మాట ప్రకారమే, ఆయన బాటలోనే నడుచుకుంటానన్నారు.ఇది తనకు చివరి ఎన్నికలని, ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కొత్తగూడెం ప్రజలకు వనమా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో జెడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), కొత్తగూడెం మునిసిపల్ వైస్ ఛైర్మన్ వీ.దామోదర్, బిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, మండే హన్మంతరావు, జేవీఎస్ చౌదరి,భీమా శ్రీధర్, భూక్యా రాంబాబు, కొత్వాల్ శ్రీనివాస్, బత్తుల వీరయ్య,లక్కినేని సత్యనారాయణ, రాజుగౌడ్,పూసల విశ్వనాథం,శ్రీరాంమూర్తి,తొట్టి వెంకటేశ్వర్లు,కంభంపాటి దుర్గాప్రసాద్, బరపాటి వాసుదేవరావు, రజాక్,అనుదీప్,కాంపెల్లి కనకేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్