- Advertisement -
సమాజాభివృద్ధికి మీడియా తోడ్పడాలి- యువ నేత బొలిశెట్టి రాజేష్
Media should help the development of society - youth leader Bolishetti Rajeshతాడేపల్లిగూడెం,
సమాజాభివృద్ధికి మీడియా తోడ్పడాలని జనసేన నియోజకవర్గ యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం సిపాయిపేట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఆంధ్రరేఖ జిల్లా సమావేశం నిర్వహించారు. విలువలతో కూడిన వార్తలు రాయాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరాలను పెంచేలా వార్తలు ఉండరాదన్నారు. అసత్య వార్తలను అరికట్టాలన్నారు. అనంతరం ఆంధ్రరేఖ టోల్ ఫ్రీ నెంబరును ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్, ప్రధాన కార్యదర్శి గోలమే బుజ్జి బాబు, పశ్చిమగోదావరి జిల్లా ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి గజపతి వర ప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుందరనీడి వెంకట లక్ష్మయ్య, షేక్ ఖాదర్ మొహియుద్దీన్, మైలవరపు రవి కిరణ్, ఆశీర్వాదరావు, , కొత్తపల్లి గోపి చంద్, కృష్ణ, చిన్న, శివ, మహేష్.నాయకులు దినేష్, ముఖేష్, పాల్గొన్నారు.
- Advertisement -




