Sunday, February 9, 2025

మార్చిలో మెగా డీఎస్సీ

- Advertisement -

మార్చిలో మెగా డీఎస్సీ

Mega DSC in March

విజయవాడ, జనవరి 31 (వాయిస్ టుడే)
ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్‌ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో కొంత జాప్యం జరిగినా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చ్ 15 తరువాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.మే మొదటి వారంలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్, జూలై నెలలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. గత ఏడాది జూన్‌12న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం చేశారు.గత నవంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువరించే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వివాదం తెరపైకి వచ్చింది. మందకృష్ణ మాదిగ అభ్యంతరాల నేపథ్యంలో నోటిఫికేషన్ వాయిదా పడింది. ఆ తర్వాత వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ పదవీ కాలాన్ని పొడిగించినా ఫిబ్రవరిలోనే కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం కమిషన్‌కు అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనాభాను కూడా గుర్తిస్తున్నారు. ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేసి కులాల వారీగా జనాభాను ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ జనాభాపై జిల్లాల వారీగా రిజర్వేషన్ల అమలును కొలిక్కి తెచ్చి నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశాలు ఉన్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్