మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
-కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న జీవన్ రెడ్డి -ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అడ్లూరి ధర్మపురి
Minister Adluri Laxman Kumar visits former minister Jeevan Reddy

ఫిబ్రవరి 20 (వాయిస్ టుడే) : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. జీవన్ రెడ్డి ఆనారోగ్యం విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజు తనకు ఉన్న జగిత్యాల జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, అధికారులు, ప్రజా ప్రతి నిధులు, తదితరులు పాల్గొన్నారు.



