- Advertisement -
విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్
Minister Lokesh for Visakhapatnam Court
విశాఖపట్నం
తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షిపై మంత్రి లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు.
- Advertisement -


